Batasha and Ghee: దేశీ నెయ్యిలో వీటిని కలుపుకుని తీసుకుంటే..అన్ని అనారోగ్య సమస్యలకు చెక్‌..

Batasha and Ghee: జీవన శైలి మారడం కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్య బారిన పడుతున్నారు. అయితే అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి దేశీ నెయ్యిని వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇందులో ఉండే గుణాలు శరీర అభివృద్ధి సహాయపడుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2022, 02:50 PM IST
  • దేశీ నెయ్యిలో మార్వాడి పటాషాలో
  • కలుపుకుని తీసుకుంటే కడుపు నొప్పి..
  • వాంతులు వంటి సమస్యల తగ్గుతాయి.
Batasha and Ghee:  దేశీ నెయ్యిలో వీటిని కలుపుకుని తీసుకుంటే..అన్ని అనారోగ్య సమస్యలకు చెక్‌..

Desi Ghee with Batasha Health Benefits: దేశీ నెయ్యి తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు శరీర ఖండారాలను పెంచడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి దీనిని  వెయిట్ గెయినర్ ప్రోడక్ట్‌ అని కూడా అంటారు. దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల సులభంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా సులభంగా బరువు పెరగాలనుకునే వారు తప్పకుండా నెయ్యిని వినియోగించాలి.  అయితే నెయ్యిలో మార్వాడి పటాషాలను కలుపుకుని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సి అన్ని పోషకాలు లభించడమేకాకుండా అన్ని రకాల అనారోగ్య సమస్యలు తీరుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా వీటిని కలుపుకుని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది.

వీటిని కలుపుకుని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది పొట్ట సమస్యలతో సతమతమవుతున్నారు. దేశీ నెయ్యి మార్వాడి పటాషాలను కలిపి తింటే పొట్ట సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి.  అంతేకాకుండా  కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. జీర్ణ క్రియ సమస్యలు కూడా తగ్గుతాయి.

2. చాలా మంది బిజీలైఫ్‌ కారణంగా ఆహారాలను తీసుకోకపోతున్నారు. దీని కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలా చేయడం వల్ల సులభంగా బరువు పెరుగుతారని నిపుణులు తెలుపుతున్నారు. . దేశీ నెయ్యిలో ఉండే విటమిన్లు ఎ, డి, కె, కాల్షియం, ఫాస్పరస్, మినరల్స్, పొటాషియం అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి ఈ నెయ్యిలో మార్వాడి పటాషాలను కలిపి తింటే బరువు సులభంగా పెరుగుతారు.

3. మారుతున్న సీజన్‌ కారణంగా దగ్గు, కఫం సమస్య రావడం సాధరణం. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మజ్జిగలో దేశీ నెయ్యి కలిపి తీసుకుంటే  అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తికి పదునుగా తయారవుతుంది. అంతేకాకుండా బరువు పెరగాలనే కోరికలుంటే ఇలా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే అన్ని రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read : Galata Geetu : భయంకరమైన అతి.. గీతూ ఓవర్ యాక్షన

Also Read : Adipurush case : ఆదిపురుష్‌కు దెబ్బ మీద దెబ్బ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News