Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ బస్సుల మీద కాదూ కదా.. మోకాళ్ల మీద కూడా పాదయాత్రలు చేసిన అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు.
Weather Forecast: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ అంచనా వేసింది. వేసవి వేడిలో కూల్ వార్త చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ నవమి శోభయాత్రలో గౌలీగూడలో రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత గాల్లో బాణం ఎక్కుపెడితే ఆమె మీద కేసు పెట్డడం ఏంటని అన్నారు. పక్కాగా మసీదువైపు ఎక్కుపెట్టిందని ఎలా చెప్తారంటూ కూడా రాజాసింగ్ ఫైర్ అయ్యారు.
Revanth Reddy: లోక్సభ ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి అందుకనుగుణంగా చర్యలు చేపట్టారు. పంద్రాగస్టు 15వ తేదీ వరకు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ దీనికోసం రైతుల రుణాల వివరాలు ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రుణమాఫీపై కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు రుణమాఫీ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు చేయకపోవడంపై తీవ్ర రాజకీయ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ రుణమాఫీపై బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తూ కాంగ్రెస్కు ఓటేయొద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రచారం చేస్తోంది.
Kondagattu Hanuman Jayanti 2024: తెలంగాణలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. దీక్షాపరులు ఆలయానికి చేరుకుని దీక్షను విరమించారు.
KT Rama Rao Surat Election: అన్యూహంగా సూరత్ లోక్సభ ఎన్నిక ఏకగ్రీవం కావడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా సూరత్ ఎంపీగా ఎన్నికవడంపై తీవ్ర విమర్శలు వస్తుండగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తప్పుబట్టారు. ఒక దేశం ఎన్నికలు లేవు అంటూ 'ఎక్స్' వేదికగా స్పందించారు. బీజేపీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలు అనేవి ఉండవంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వైఫల్యంతోనే సూరత్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యిందని విమర్శించారు.
Taslima Mohammad: సబ్ రిజిస్ట్రార్ తస్లీమామహమ్మద్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తస్లీమా.. 5 ఇళ్లను,6 ఓపెన్ ప్లాట్స్ లను, 3 ఎకరాల భూమిని కల్గి ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది.
TS SSC Results Date: ఏపీ పదో తరగతి ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక తెలంగాణ ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలు విడుదల కావల్సి ఉన్నాయి. మరో వారం రోజుల్లో అంటే ఏప్రిల్ 30వ తేదీన పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది.
KTR Big Positive Comments On Lok Sabha Polls: పార్లమెంట్ ఎన్నికలపై కేటీఆర్ పార్టీ నాయకులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కనున్నాయని పార్టీ నేతలతో పంచుకున్నారు.
Telangana Inter Results 2024: తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక ప్రకటన జారీచేసింది. ఈనెల 24 వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో ఇంటర్ ఫలితాలను ప్రకటించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాల్లో ఓ విద్యార్థిని మార్కులు అందరినీ నివ్వెరపరిచాయి. ఆమె ఏకంగా 600కు గాను 599 మార్కులు తెచ్చుకుని అందరినీ షాక్ కు గురిచేసింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, ఏ జిల్లాకు చెందినదో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ స్టోరీ చదివేయండి.
BJP Madhavi Latha: ఎన్నికల ప్రచారంలో పోలీసు అధికారిణి చేసిన పని ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే మాధవీలన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ఉమాదేవీ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈఘటకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Revanth Reddy Election Campaign In Adilabad: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిస్తే పథకాలు రావని ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.