Raja Singh: హైదరాబాద్ లోక్సభ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాధవీలతకు భారీ షాక్ తగిలింది. మొదటి నుంచి ఆమె అభ్యర్థిత్వం వ్యతిరేకిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆమె నామినేషన్ ర్యాలీకి గైర్హాజరు కావడం కలకలం రేపింది. మాధవీలతపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాజా సింగ్ పార్టీ ఆదేశించినా కూడా ఆమెకు లోక్సభ ఎన్నికల్లో సహకరించడం లేదు. ఇప్పుడు నామినేషన్కు రాలేకపోవడంతో పార్టీ కార్యకర్తల్లో కలవరం మొదలైంది. మాధవీలత, రాజా సింగ్ మధ్య విభేదాలు హైదరాబాద్ లోక్సభ ఎన్నికపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
KCR Live Interview Present Politics: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఓ ఛానల్లో తొలిసారి ఇంటర్వ్యూకు వచ్చారు. ఈ సందర్భంగా నాలుగు నెలల్లో జరిగిన రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Barrelakka Filed Nomination For Lok Sabha Elections: అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన బర్రెలక్క మరో కీలక అడుగు వేసింది. మళ్లీ ఎన్నికల్లో నిలిచింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేసింది.
KTR Big Positive Comments On Lok Sabha Polls: పార్లమెంట్ ఎన్నికలపై కేటీఆర్ పార్టీ నాయకులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కనున్నాయని పార్టీ నేతలతో పంచుకున్నారు.
Revanth Reddy Election Campaign In Adilabad: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిస్తే పథకాలు రావని ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
Harish Rao Fire On Revanth Reddy In Medak Election Campaign: లోక్సభ ఎన్నికల్లో మెదక్ స్థానం హాట్ హాట్ రాజకీయాలకు వేదికగా మారింది. మెదక్ రాజకీయాలు రేవంత్ రెడ్డి వర్సెస్ హరీశ్ రావుగా మారాయి. మరోసారి రేవంత్పై హరీశ్ రావు విరుచుకుపడ్డారు.
Andhra Pradesh Congress Lok Sabha Candidates List With 9 Segments: ఏపీలో పాగా వేయాలనే లక్ష్యంతో భారీ వ్యూహం రచిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితాను పూర్తి చేసింది. చివరి జాబితాలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. వారిలో పార్టీని నమ్ముకుని ఉన్నవారికే ప్రాధాన్యం దక్కింది.
YS Jagan: ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పవన్ కల్యాణ్ అభిమానులు భారీ షాక్ ఇచ్చారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పవన్కు మద్దతుగా నినాదాలు చేశారు. 'జై బాబు.. జైబాబు' అంటూ పవన్కు మద్దతుగా నినాదాలు చేయడంతో అక్కడ కలకలం ఏర్పడింది. విద్యార్థుల తీరుపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు.
KCR Campaign: లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బిజీబిజీ అయ్యారు. మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లనున్నారు. మిర్యాలగూడ నుంచి మొదలుపెట్టి సిద్దిపేటతో తన ప్రచారాన్ని ముగించనున్నారు. బస్సు యాత్ర, రోడ్ షోలతో కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. అత్యధిక స్థానాలు గెలుపొందే వ్యూహంలో కేసీఆర్ ప్రచారం ప్రారంభించనున్నారు.
BRS Party Cheif KCR Distributed B Forms: అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫుల్ జోష్లో ఉన్నారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఎంపీ అభ్యర్థులకు బీఫామ్లు, ఎన్నికల నిధిని అందించారు. ఈ సందర్భంగా లోక్సభ అభ్యర్థులకు ఆశీస్సులు అందించి విజయంతో తిరిగిరావాలని దీవించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కోలాహలం సంతరించుకుంది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ హుషారుగా కనిపించడంతో గులాబీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమయ్యాయి.
BRS Party: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పక్కదారి చూస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు మద్దతు పలికారు. త్వరలో సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాషాయం గూటికి చేరనున్నారు.
Lok Sabha Elections TMC Manifesto: ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇస్తున్నాయి. తాజాగా తాము గెలిస్తే 10 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఒక పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ హామీల్లో ఉచితాలు చాలా ఉన్నాయి.
KCR Review Meeting On Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల సందర్భంగా గులాబీ దళపతి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం సమీక్ష సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధించే దిశగా కేసీఆర్ అభ్యర్థులు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం పార్టీ అభ్యర్థులకు బీఫారాలతోపాటు రూ.95 లక్షలు ఎన్నికల నిధి అందించనున్నారు.
KCR Hot Comments On Revanth Reddy In Poll Campaign: లోక్సభ ఎన్నికల సందర్భంగా గులాబీ దళపతి కేసీఆర్ మళ్లీ జోరుగా ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిని లిల్లిపుట్ అని అభివర్ణించారు.
Revanth Reddy Surgical Strikes On BJP Amid Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు బీజేపీపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రేవంత్ దెబ్బకు కాషాయ పార్టీ కకావికాలమవుతోంది.
Revanth Reddy Shock: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర పరాభావం ఎదురయ్యే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలపై సునీల్ కనుగోలు బృందం ఇచ్చిన నివేదిక రేవంత్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చింది. 14 స్థానాలు లక్ష్యంగా పెట్టుకోగా అందులో సగం సీట్లు దక్కవని సునీల్ బృందం నివేదించింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరే హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో భారీ ఎదురుదెబ్బ తగులుతుందని ఆ కమిటీ వెల్లడించింది. దీంతో రేవంత్ రెడ్డి ఎన్నికల వ్యూహం మార్చేందుకు సిద్ధమయ్యారు.
KCR House Kshudra Pooja: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసం సమీపంలో క్షుద్ర పూజలు జరగడం కలకలం రేపింది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని నందినగర్లో కేసీఆర్ నివసిస్తున్నారు. ఇంటి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో క్షుద్రపూజల ఆనవాళ్లు ఉన్నాయి. ఎర్రబట్ట, నిమ్మకాయలు, బొమ్మ ఉండడం స్థానికంగా భయాందోళన మొదలైంది. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది చర్చనీయాంశంగా మారింది.
Revanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్ లోక్సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.